Tuesday, 26 January 2016

భార‌త కుర్రాళ్లు అద‌ర‌గొడుతున్నారు

ఆసీస్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో  టీమ్ఇండియాకు ఎన్నో సానుకూల అంశాలు క‌నిపించాయి. ముఖ్యంగా యువ ఆట‌గాళ్లు గొప్ప‌గా ఆక‌ట్టుకున్నారు. గుజ‌రాత్ యువ పేస‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా, బ‌రోడా ఆల్‌రౌండ‌ర్ హ‌ర్ధిక్ పాండ్య‌ల ఆట సూప‌ర్‌. ముఖ్యంగా బుమ్రా బౌలింగ్ అద్భుతంగా క‌నిపిస్తోంది. ఎలాంటి వైవిధ్యం లేకుండా సాదాసీదా ఉన్న భార‌త బౌలింగ్‌లో బుమ్రా కొత్త ఆయుధంలా చేరాడు.

అడిలైడ్‌లో జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లో అత‌ను ఫాల్క‌న‌ర్‌కు సంధించిన యార్క‌ర్ క‌ళ్లు చెదిరేలా ఉంది. కొత్త బౌలింగ్ శైలితో పాటు బ్యాట్స్‌మెన్ క‌ద‌లిక‌ల‌ను బ‌ట్టి తెలివిగా బంతులు వేయ‌డంలో ఈ కుర్రాడు ఆరితేరిన‌ట్లు క‌నిపిస్తున్నాడు.. చ‌క్క‌టి వేగానికి తోడు మంచి లెంగ్త్‌తో అత‌ను బౌలింగ్ చేస్తుంటే భార‌త పేస్ బౌలింగ్ క‌ష్టాలు తీరిన‌ట్లే క‌నిపిస్తున్నాయి.

మ‌రోవైపు హ‌ర్దిక్ పాండ్య బౌలింగ్ కూడా భార‌త్‌కు కొత్తద‌నాన్ని తెచ్చింది. స్లో బంతులతో పాటు వికెట్ టు వికెట్ బౌలింగ్‌తో ప్ర‌త్య‌ర్థుల‌ను క‌ట్ట‌డి చేస్తున్నాడీ ఆల్‌రౌండ‌ర్‌. బ్యాటింగ్‌లో ఇంకా ఎక్కువ అవ‌కాశాలు రాని పాండ్య‌... అడిలైడ్‌లో ఆక‌ట్టుకున్నాడు.  వ‌న్డే సిరీస్‌లో సిడ్నీ ఆఖ‌రి వ‌న్డేలో మెరిసిస మ‌నీష్ పాండేను మ‌రిచిపోలేం. అద్భుత శ‌త‌కంతో జ‌ట్టును గెలిపించిన పాండే.. భ‌విష్య‌త్ ఆట‌గాడిన‌ని నిరూపించుకున్నాడు.

No comments:

Post a Comment